ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు

11 Oct, 2018 20:23 IST|Sakshi

చికాగో : తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చికాగోలోని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో హనుమంత్‌ రెడ్డి, మెహర్‌ మాదవరం, లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం, వెంకట్‌ తుడి, మహిపాల్‌ వంచ, హరి రైనీ, సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలైన జానపద గాయనీ రాగం శాలినీ ఆలపించిన పాటలు హుషారెత్తించాయి. 

మరిన్ని వార్తలు