మెల్‌బోర్న్‌లో బీజేపీ విజయోత్సవం

10 Jun, 2019 20:45 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీ అఖండమెజారిటీతో రెండోసారి విజయం సాధించడం సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఆపార్టీ మద్దతుదారులు విజయోత్సవ సభ నిర్వహించారు. వైందమ్‌ కౌన్సిల్ మాజీ డిప్యూటీ మేయర్‌ గౌతమ్‌ గుప్తా ఆధ్యర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బీజేపీ మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదటగా వందేమాతరం ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఇటీవల కేరళ, కర్ణాటక, తెలంగాణలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తలకు అంజలి ఘటించారు. అనంతరం కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అమరెందర్‌రెడ్డి కోత, మహేశ్‌ బద్దం, శ్రీపాల్‌ బొక్క, రామ్‌ నీత, వంశీ కొత్తల, దీపక్‌ గడ్డె, విశ్వంత్‌ కపిల ఇతర బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు