లేహ్: డ్రాగన్ మరోసారి ‘హద్దు’ మీరింది. భారత గగనతల సరిహద్దులోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు అక్రమంగా ప్రవేశించాయి.లడఖ్లోని చుమర్ సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా)కి చెందిన రెండు హెలికాప్టర్లు గత జూలై 11న భారత్ గగనతలంలోకి చొచ్చుకొచ్చి నిఘా కెమెరాల చేతికి చిక్కాయి. కొన్ని గ ంటల పాటు చైనా ఆర్మీ హెలికాప్టర్లు చుమర్ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, భారత ఆర్మీ అధికారులు మాత్రం ఈ సంఘటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
చైనా హెలికాప్టర్లు కేవలం భారత సరిహద్దు ప్రాంతానికి సమీపంగా మాత్రమే వచ్చాయని, మన భూభాగంలోకి చొచ్చుక రాలేదని తెలిపారు. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో ఉద్రికత్తతలు తగ్గించి శాంతిని పెంపొందించేందుకు రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోని చైనా పర్యటించిన కొన్ని రోజులకే ఈ సంఘటన వెలుగులోకి రావడం గమనార్హం. గత కొంత కాలంగా చైనా ఆర్మీ నిబంధనలను ఉల్లఘింస్తూ అనేకసార్లు చుమర్ ప్రాంతం నుంచి భారత సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించింది. ఏప్రిల్లో కూడా ఇదే ప్రాంతంలో భారత బంకర్లను పేల్చివేసిన చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులకు తెరలేపింది.