భారతీయులకు సులభంగా వీసా జారీ : జర్మనీ రాయబారీ

2 Jul, 2013 17:33 IST|Sakshi

భారతీయుల కోసం వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు భారత్లోని జర్మనీ రాయబారీ  మైఖేల్ స్టైనర్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఈ వీసాలను జారీ చేస్తామని తెలిపారు. మంగళవారం శ్రీనగర్లోని కాశ్మీర్ యూనివర్శిటీ విద్యార్థులతో మైఖేల్ ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సులభతరమైన వీసా ప్రక్రియ వల్ల ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతోందని వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న వీసా జారీ ప్రక్రియ కొంత సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. దాంతో వీసా సేవలను ఔట్ సోర్సింగ్ విభాగానికి అప్పగించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియ వచ్చే ఆరునెల్లో ప్రారంభం కాగలదని మైఖేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

మరిన్ని వార్తలు