అబుదాబి : అబుదాబిలో హిందూ మందిరాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ 20న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ మహంత్ స్వామి మహరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆ రోజు ప్రజలకు పునాది రాళ్ళ దర్శనం కల్పిస్తారు. మందిర ప్రాంగణంలో యజ్ఞం నిర్వహిస్తారు. యజ్ఞంలో పాల్గొనదలచిన వారు outreach@mandir.ae సంప్రదించవచ్చు.