దుబాయ్‌ లాటరీలో భారతీయునికి రూ.6.8 కోట్లు

1 Aug, 2018 09:02 IST|Sakshi

దుబాయ్‌: దుబాయ్‌ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్‌లో నివసిస్తున్న సందీప్‌ మీనన్‌ రూ.6.8 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్‌ డ్యూటీఫ్రీ రాఫిల్‌గా పిలుస్తున్న ఈ లాటరీలో గెలుపొందిన 132వ భారతీయుడిగా మీనన్‌ నిలిచారని ‘ఖలీల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్‌ డ్యూటీఫ్రీ రాఫల్‌కు ధన్యవాదాలు’ అని మీనన్‌ అన్నారు.

ఈ లాటరీలో మీనన్‌తో పాటు మరో భారతీయుడు సహ విజేతగా నిలిచారు. దుబాయ్‌కే చెందిన శాంతిబోస్‌ బీఎండబ్ల్యూ ఆర్‌9టీ కారును గెలుచుకున్నారు. ఈజిప్టుకు చెందిన హొస్సాం హుస్సేన్‌ సల్మాన్‌ బీఎండబ్ల్యూ 750ఐ లగ్జరీ సిల్వర్‌ మెటాలిక్‌ కారును సొంతం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు