హ్యూస్టన్‌లో పాలపిట్ట ​పుస్తకావిష్కరణ

20 Jul, 2018 10:53 IST|Sakshi

​టెక్సాస్‌, హ్యూస్టన్ : ప్రవాస తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక సంచిక 'పాలపిట్ట'ను తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హ్యూస్టన్‌లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలంగాణ మహా సభల సందర్భంగా ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో రైతే రాజు, సినారే ఘన నివాళి, నాలుగేళ్ల తెలంగాణ, హ్యూస్టన్ తెలుగు భవనం, బోనాలు, బతుకమ్మ పండుగ, తెలంగాణంతో పాటు మరెన్నో విశేషాలు పొందుపరిచారు.

ఈ పుస్తక ప్రచురణకు ప్రొఫెసర్ సాంబరెడ్డి ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులు కృష్ణ సాగర్ రావు, అమెరికా తెలంగాణ సంఘం కార్య వర్గం, తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన పలువురు కళాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు