టెక్సాస్ : అమెరికాలో కాటీ ప్రీమియర్ లీగ్-2018 (కేపీఎల్) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ లీగ్లో భాగంగా ఆగస్టు 5,6న హోస్టన్ స్పోర్ట్స్ప్లెక్స్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గత ఆగస్టు 5న (శుక్రవారం) ప్రారంభమైన ఈ లీగ్లో 43 మల్టీ స్టేట్ టీమ్స్ పాల్గొన్నాయి. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా స్టాప్ఫార్డ్ కౌన్సిల్ మెంబర్ కెన్ మాథ్యూస్, గ్రాండ్ స్పాన్సర్ రఘువీర్లు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ ద్వారా 85వేల యూఎస్ డాలర్లను సేకరించామని, వీటిని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణ గిరి, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న మయూరి గిరిల వైద్యానికి ఖర్చు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే కేరళ, కర్ణాటక వరద బాధితులకు ఆదుకుంటామన్నారు. కేపీఎల్ చారిటీ కొండూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని పునర్నిర్మించనుందన్నారు. ఈ రెండు రోజులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను పిల్లలు, పెద్దలు ఆస్వాదించారని పేర్కొన్నారు.