డల్లాస్: అమెరికాలోని డల్లాస్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రిస్కోలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహోత్సవానికి భారత్ నుంచి పలువురు ప్రముఖ పండితులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఉత్సవాలలో యాదాద్రి పండితులు రంగాచార్యులు, రమణాచార్యులు, వెంకటాచార్యులతో పాటు యాదాద్రి సూపరింటెండెంట్ రఘు దగ్గరుండి పర్యవేక్షించారు.