యూఎస్లో కీరవాణి 'రాగం'

20 Jul, 2013 16:29 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో సంగీత విభవరి ఏర్పాటు చేసినట్లు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. న్యూజెర్సీలో ఈ రోజు సాయంత్రం 6:00 గంటల నుంచి 10:00 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. జూలై 21 అంటే ఆదివారం సెయింట్ లూయిస్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుందని పేర్కొంది.

 

ఈ నెల 27న సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు శాన్ జోస్లో సంగీత విభావరి నిర్వహించనున్నట్లు తెలిపింది. అమెరికా నగరంలో చిట్టచివరి సంగీత విభావరి సీటెల్స్లో 5 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుందని నాట్స్ వివరించింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వర్థమాన గాయనీగాయకులు గీతామాధురీ, రేవంత్, రాహుల్, నీయోల్, సాహితీ, రమ్యలు తమ గానామృతంతో ఎన్నారైలను వినులవిందు చేయనున్నట్లు నాట్స్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు