ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు

13 Jun, 2018 20:42 IST|Sakshi
మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

డల్లాస్‌ : మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నాల్గవ అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహించనున్నాయి. జూన్‌17వ తేదిన డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనుపమ రాయ్‌, ఇర్వింగ్‌ మేయర్‌ మీఘర్‌ హాజరుకానున్నారు. జూన్‌17వ తేదిన ఉదయం 7:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం కొనసాగనుంది. యోగాలో పాల్గొనే వారికి ఉదయం ఫలహారంతో పాటు యోగా మ్యాట్‌లను కూడా నిర్వాహకులే అందజేస్తారు. 

మరిన్ని వార్తలు