రాజేంద్రనగర్: అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న కార్తీక్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరానికి వచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ హైదర్షాకోట్ పొలింగ్ బూత్ 56లో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు నారాయణరావు, జ్యోతితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చానన్నారు. ఆదివారం రాత్రి తిరిగి అమెరికాకు పయనమవుతున్నట్లు వెల్లడించారు. ఓటు ఎంతో పవిత్రమైందన్నారు. ప్రపంచంలోనే భారత దేశ ప్రజాస్వామ్యం ఎంతో గోప్పదన్నారు. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.