బంగీజంప్‌తో బాసట..

23 Sep, 2018 21:46 IST|Sakshi

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలోనే కాక పలు దేశాల నుంచి పార్టీ అభిమానులు సంఘీభావం తెలుపుతున్నారు.

పాదయాత్రలో అలుపెరుగని యోధునిలా అప్రతిహతంగా దూసుకుపోతున్న జగనన్నకు వాడవాడలా మద్దతు వెల్లువెత్తుతోంది. రాజన్న తనయుడి పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరనున్న క్రమంలో దక్షిణాఫ్రికాలో పార్టీ పతాకం‍తో అత్యంత లోతైన  బంగీజంప్‌ చేసి గురజాల మాజీ శాసనసభ్యులు కొత్త వెంకటేశ్వర్లు మనవడు కొత్త రామకృష్ణ తన అభిమానాన్ని చాటుకున్నారు.
 

మరిన్ని వార్తలు