టెక్సాస్ : శ్రీ షిర్డీ సాయిబాబా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం టెక్సాస్లోని ప్లానోలో ఘనంగా జరిగింది. షిర్డీ నుంచి వచ్చిన పూజారులు గురువారం ఉదయం 8.25 నిముషాలకు సద్గురు సాయినాథ్ మహరాజ్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయ ప్రారంభోత్సవాలను వారం పాటు (19 నుంచి 24 వరకు) జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3000 మంది భక్తులు పాల్గొన్నారు.