ఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

23 May, 2018 15:36 IST|Sakshi

సింగపూర్‌ : సామాజికసేవా కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌), రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న దాదాపు 50 మంది తెలుగు వారితో పాటు, ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారు. 

సోమ రవి ఆధ్వర్యంలో సభ్యులు కాశి, ప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్త దానం శిబిరం నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు, పాల్గొన్న దాతలకు సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞలు తెలిపారు. ఇలాంటి సమాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు