సింగపూర్‌లో తెలుగు సమాజం మేడే వేడుకలు

2 May, 2018 23:22 IST|Sakshi

సింగపూర్‌ : "శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం... శ్రమను గౌరవిద్దాం" అనే నినాదంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  మంగళవారం స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సింగపూర్ తెలుగువారి కోసం ఆయన ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు సమాజం మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా హాజరు  కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలుగు వారందరూ ఐకమత్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ, దాతలకు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు