విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్(సింగపూర్) మీడియా ఇంచార్జీ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ ఆధ్వర్యంలో విశాఖపట్నం 28వ వార్డులో అలిపురంలో అడుగు పెట్టిన విజయసాయి రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. సంఘీభావ యాత్రలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.