సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) నిర్వహిస్తున్న సామాజికసేవా కార్యక్రమాలలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో స్ధానిక ధోబిఘాట్లోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం చాలా ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
స్థానికంగా నివసిస్తున్న సుమారు 50 మంది తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. సోమ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల తెలుగు సమాజంకి రెడ్ క్రాస్, బ్లడ్ బాంక్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. రక్త దాన శిబిరం నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు, దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞలు తెలిపారు.