'మే డే'న కార్మికులతో ఎస్‌టీఎస్‌ ఆత్మీయ పలకరింపు

2 May, 2019 12:24 IST|Sakshi

సింగపూర్‌ : శ్రామిక దినోత్సవం మే డే సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌) సభ్యులు కార్మికులతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్‌లో పని చేస్తున్న కార్మికులను ఎస్‌టీఎస్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసింది. ఈ సందర్భంగా కార్మికులకు గిఫ్ట్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమం సెంబవాంగ్, కెన్టెక్, టుఆస్, బుకిట్ బటోక్, మెగాయార్డ్, పెంజూరులో ఉన్న హాస్టల్స్‌లో జరిగింది. కార్మికులకు అండగా ఉండటానికి కార్మికుల సహాయనిధిని అధికారికంగా ప్రారంభించామని ఎస్‌టీఎస్‌ ప్రెసిడెంట్ కోటిరెడ్డి అన్నారు. కార్మిక సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.

సింగపూర్‌లో ఉన్న తెలుగు వారికి ఏదైనా ఆపద కలిగితే తమ కార్యవర్గం సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్‌టీఎస్‌ వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు పది హాస్టళ్లలో ఉన్న కార్మికులను కలిసి గిఫ్ట్ బాటిల్స్ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, టీమ్ లీడర్స్ కు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు