సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్లో లేనివి ప్రశ్నపత్రంలో ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లో 2,000 మంది తెలుగు వైద్య విద్యార్థులు అధ్యక్ష భవనం ముందు ఆందోళన చేసినట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.