ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మరో కేసు నమోదైంది. వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు 2019 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు అందుకోనున్నారు. విలియంకెలిన్, పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెన్జాకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.