సిడ్నీ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు (డిసెంబర్ 21) సందర్భంగా శనివారం ఆస్ట్రేలియాలోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్ జగన్ యువసేన అధ్యక్షుడు చింతల చెరువు సూర్య నారయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. భగవంతుడు జగన్కు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజా సమస్యల పరిష్కారంలో తోడుండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
రక్తదాన కార్యక్రమంలో ఫణి, శివశంకర్ రెడ్డి, ప్రకాశ్ నాయుడు, దేవరపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికీ వైస్ఆర్సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, చలమల శెట్టి సునీల్, వెల్లంపల్లి శ్రీనివాస్, శిల్ప రవి కిశోర్ రెడ్డిలు అభినందనలు తెలియజేశారు.
భారీ కార్ల ర్యాలీ..
జననేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 500 కిలో మీటర్లు పూర్తిచేసిన సందర్భంగా మెల్బోర్న్లో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 'అలుపెరగని ఆ బాటసారికి(వైఎస్ జగన్ కు), సడలని ఆ సంకల్పానికి ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులం శిరస్సువంచి సలాం చేస్తున్నాం' తెలిపారు.