సిడ్నీ : ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ముందస్తుగా జరుపుకున్నారు. ఆసీస్ తెలుగు అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు కాగా, ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.