వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం.. దుబాయ్‌లో సంబరాలు

31 May, 2019 17:24 IST|Sakshi

దుబాయ్‌ : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌ సీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దుబాయ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులందరూ ఒక్క చోట చేరి సెలబ్రేట్‌ చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైఎస్సార్‌సీపీ యూఏఈ కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి , బ్రహ్మనంద రెడ్డి , రమేష్ రెడ్డి , విజయ్ , దిలీప్ , రమణ రెడ్డి , యస్వంత్.. యూఏఈ మహిళా విభాగం నాయకురాలు మహిత రెడ్డి, పార్టీ అభిమానులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు