రామచంద్రారెడ్డితో వైఎస్సార్‌సీపీ సింగపూర్‌ శాఖ కన్వీనర్‌ భేటీ

16 Dec, 2018 11:53 IST|Sakshi
రామచంద్రారెడ్డి - జయప్రకాశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేస్తామని వైఎస్సార్‌సీపీ సింగపూర్‌ వింగ్‌ కన్వీనర్ దక్కట జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ చేపడుతున్న కార్యకలాపాలపై వారు చర్చించారు. ‘రామచంద్రారెడ్డిని కలుసుకోవడం ఆనందం ఉంది. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం పనిచేస్తాం’అని జయప్రకాశ్‌ రెడ్డి చెప్పారు.

>
మరిన్ని వార్తలు