ప్రతిభా పురస్కారాలు

10 Feb, 2015 01:15 IST|Sakshi

స్నేహ ఆర్ట్స్ అకాడమి తిరుపతి వారి ఆధ్వర్యంలో ప్రతిఏటా ప్రతిభా పురస్కారాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవ త్సరం కూడా పురస్కార గ్రహీతల ఎంపిక కోసం దరఖాస్తులని ఆహ్వా నిస్తున్నాము. ఇందుకుగాను సమాజానికి బహుముఖంగా తమ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, కళాకారులు (నృత్యం) రచయితలు, రైతులు, పౌరోహిత్యం లాంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఈ  పురస్కారం పట్ల ఆసక్తి ఉండీ, తగిన అర్హత కలిగి ఉంటే అలాంటి వారు తమ వివరాలని జతపరచి పంపాలని కోరుతున్నాము. ఈ పురస్కారాలకు అర్హులైన వారు ఫిబ్రవరి నెల 20వ తేదీలోపు తమ పూర్తి వివరాలని జతపరుస్తూ ఈ కింది చిరునామాకు పంపగలరని ఆశిస్తున్నాం. సమాజానికి మీరు అందిస్తున్న సేవలని గుర్తించి మీ సేవలని మరింత విస్తృత పరుస్తూ మీరు నలుగురికీ ఉపయోగకరమైన పనులను స్వచ్చందంగా ఇకముందు కూడా నిర్వహించేందుకు గాను ప్రోత్సాహకంగా ఈ పురస్కారాలని మీకు అందించే ప్రయత్నమే మా స్నేహ ఆర్ట్స్ అకాడమి ఆలోచన. మీ పూర్తి చిరునామా, సామాజిక సేవలో మీ పాత్ర వివరాలను 2015 ఫిబ్రవరి 20 లోపు ఈ కింది చిరునామాకు పంపగలరు.

- కార్యదర్శి, స్నేహ ఆర్ట్స్ అకాడమి. 13-5-531/ఎ. టాటానగర్, పశువైద్యశాల ఎదురుగా, తిరుపతి. మొబైల్: 9703234092

మరిన్ని వార్తలు