"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్ర ఆవిష్కరణ

15 Nov, 2013 11:58 IST|Sakshi

"చరిత్రకే ఒక్కడు" పుస్తక ముఖ చిత్రాన్ని, అట్లాంటా మహానగరంలో, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల ఉడుముల ఆధ్వర్యములో, ప్రముఖ తెలుగు సామాజిక నాయకులు డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ సంజీవ రెడ్డి, డాక్టర్  హరనాథ్ పొలిచర్ల ఆవిష్కరించారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి  జీవిత చరిత్ర  "చరిత్రకే ఒక్కడు" ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే పట్టుదలతో, రచయత చెరుకు కరణ్ రెడ్డి మరియు  ప్రవాసాంధ్ర  పాత్రికేయుడు, వేణుగోపాల ఉడుముల సహకారముతో, డిసెంబర్ 30వ తేది, ఈ అద్బుతమైన పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా,  హైదరాబాద్ లో మరియు తెలుగు వాళ్ళున్న దేశాల్లో విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు