కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న సచిన్ ను చూసేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున్న వాంఖెడే స్టేడియానికి వచ్చారు. చివరి మ్యాచ్ లో సచిన్ ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్, అజిత్ వాడేకర్, హృతిక్ రోషన్, పూనమ్ పాండే, వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడి, శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. సెక్సీ స్టార్ పూనమ్ పాండే తన చేతిపై సచిన్ టాటూ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.