ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్), సూత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద కొర్జో థియేటర్ సహకారంతో గురువారం రవీంద్రభారతిలో నిర్వహించిన నృత్య సమ్మేళం ప్రేక్షకులను కట్టిపడేసింది. రామయణంలోని ఘట్టాలు ఇతివృత్తంగా భరతనాట్య శైలిలో సాగిన ‘రివర్ సూత్ర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రవీంద్ర భారతి వేదికపై సాగిన ఈ కార్యక్రమానికి రామిల్ ఇబ్రహీం దర్శకత్వం వహించగా, కల్పనా రఘురామన్ కొరియోగ్రఫీ అందించారు.
కౌలాలంపూర్కు చెందిన రామిల్ ఇబ్రహీం, గోవిందరాజో, టాన్, దివ్యనైర్, శివగమ వల్లీ, గీతికాశ్రీ, వేతిజై, గజతేశ్వర నృత్యకారులు క్లాసిక్, ఒడిస్సీ నృత్య రీతులను ప్రస్తుత శైలిలో ప్రదర్శించారు.
నాట్య ప్రదర్శనలో కళాకారుల విన్యాసాలు..