పూరి క్షేత్రంలో కొలువై ఉన్న జగన్నాథుడి రథయాత్ర బుధవారం అంగరంగ వైభోగంగా సాగింది.
పది లక్షల మందికిపైగా దేవదేవుడి ఊరేగింపును తిలకిస్తూ భక్తిపారవశ్యంలో మునకలేశారు.
జేగంటలు, కొమ్ముబూరలు, శంఖాలు మోగిస్తూ ఆనందతాండవం చేశారు.
బుద్ధగయ వరుస బాంబుఏ పేలుళ్ల నేపథ్యంలో రథయాత్రకు గట్టి భద్రత కల్పించారు.
ప్రధాన ఆలయమైన శ్రీమందిరంలోని జగన్నాథుడు, ఆయన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుల మూల విరాట్లను మూడు సర్వాలంకృత భారీ రథాల్లో గుండిచా మందిరానికి చేర్చారు.