133వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

10 Apr, 2018 09:12 IST|Sakshi

సాక్షి, మంగళగిరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, భరోసానిస్తూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌ పెదవడ్లపూడి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

అక్కడి నుంచి ఆత్మకూరు మీదుగా తెనాలి ఫ్లై ఓవర్‌ సెంటర్‌కు చేరుకుంటారు. అనంతరం మంగళగిరి పాత బస్టాండ్‌ మీదుగా హీర పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు