సాక్షి, పత్తిపాడు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 233వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు గురువారం ఉదయం నైట్ క్యాంప్ నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి డీజే పురం వరకూ యాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ 232వ రోజు పాదయాత్ర డిజే పురంలో ముగిసింది. నేడు జననేత 7.1 కిలోమీటర్లు నడిచారు. బీబీ పట్నం క్రాస్, గిడిజాం, ఎస్ అగ్రహారంల మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ప్రజాసంకల్పయాత్రలో ఇప్పటివరకు వైఎస్ జగన్ మొత్తం 2,685 కిలోమీటర్లు నడిచారు.