235వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

12 Aug, 2018 08:23 IST|Sakshi

సాక్షి, తుని/తూర్పుగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 235వ రోజు ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో ప్రారంభమైంది. తుని, రేఖవానిపాలెం, మరువాడ, నందివొంపు, గండి మీదుగా డి.పోలవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు.ఇప్పటి వరకు ఆయన 2701.8 కిలోమీటర్లు నడిచారు.

>
మరిన్ని వార్తలు