నటి వింద్య ప్రచారానికి సిద్ధం

10 Apr, 2019 12:35 IST|Sakshi

పెరంబూరు: సినీ నటి వింద్య సైతం ఎన్నికలప్రచారానికి సిద్ధమైంది. బుధవారం నుంచి 16వ తేదీ వరకూ ఈమె చెన్నైలోని పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆమె ప్రచార వేళలను, ప్రాంతాలను వెల్లడించారు. అందులో నటి వింధ్య బుధవారం సాయంత్రం 5 గంటలకు షోళింగర్‌ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు కుయాత్తం, 8.30 గంటలకు ఆంబూర్‌ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు.

అదే విధంగా 11వ తేదీన ఉదయం 11 గంటలకు హోసూర్, సాయంత్రం 5 గంటలకు ఆరూర్, 7 గంటలకు బాప్పిరెడ్డిపట్టి ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. అదే విధంగా 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు పెరియకుళం, 7 గంటలకు ఆండిపట్టి, 13వ తేదీన నీలకోట్టై, సాందూర్, విళాత్తికుళం ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. ఇక 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరమకుడి, 7 గంటలకు మానామధురై ప్రాంతాల్లోనూ, 15వ తేదీన తిరువళ్లూర్‌ ప్రాంతంలోనూ, 16వ తేదీన పూందమల్లి, తిరుపోరూర్‌ ప్రాంతాల్లో నటి వింద్య ప్రచార  కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు