సాక్షి, నల్గొండ: ప్రజాస్వామిక తెలంగాణ సాధన దిశగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. బాధ్యత మరచిన ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తేవాలని పిలుపినిచ్చారు. అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన శనివారం మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతు సమస్యలు అధిగమించేందుకు... గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందిస్తామని కోదండరామ్ పేర్కొన్నారు.