అలహాబాద్‌ ఇక ప్రయాగ్‌ రాజ్‌..!

16 Oct, 2018 13:44 IST|Sakshi

సాక్షి, లక్నో/ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నగరం అలహాబాద్‌ పేరును ప్రయాగ్ రాజ్‌గా యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ.. యోగి కేబినెట్‌ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్ముక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు