సాక్షి, అమరావతి: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు కలిసి దొంగ దీక్షలకు తెరతీసారని, నాలుగేళ్లలో హోదాను చంపేసి న బాబు ఈనెల 16న చేసే బంద్కు మద్దతు ఇవ్వకపోగా పోలీసులతో ఆందోళనకారులకు నోటీసులు ఇప్పిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు.
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లా డారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సంద ర్భంగా ఈనెల 20న నిరాహారదీక్ష చేస్తున్న ట్లు ప్రకటించారని, రాష్ట్రానికి అన్యాయం జరగటానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసునన్నారు.