ఇప్పుడూ నీచ రాజకీయాలా?

25 Mar, 2020 05:20 IST|Sakshi

చంద్రబాబుపై అంబటి ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఆయన తాను ప్రసంగించిన వీడియో విడుదల చేశారు. ఇందులో అంబటి ఏమన్నారంటే..
- ప్రపంచవ్యాప్తంగా మానవాళి క్లిష్ట పరిస్థితిలో ఉంది. అందరూ కోవిడ్‌పై తీవ్ర పోరాటం చేస్తున్నారు. 
- రాజకీయాల గురించి చాలాసార్లు, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే.. కోవిడ్‌ సమయంలోనూ చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ నేతలతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని దూషిస్తున్నారు. 
- 25 లక్షల మంది పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే  బాబు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి రాక్షసానందాన్ని అనుభవిస్తున్నారు. 
- వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకమా, పేద ప్రజానీకానికి వ్యతిరేకమా అనేది బాబు ఆలోచించుకోవాలి.

మరిన్ని వార్తలు