నేటి సాయంత్రం పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో ఢిల్లీలో భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులను అత్యవసరంగా ఢిల్లీ రావాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో ఆయన సమావేశమవుతారు.
ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం, కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు తదితరులకు పిలుపు వచ్చింది.