14న రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్‌ షా భేటీ 

8 May, 2018 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికలు ముగియగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణపై దృష్టి సారించనున్నారు. ఈ నెల 12న అక్కడ ఎన్నికలు అయిపోగానే 14న ఢిల్లీలో అమిత్‌ షా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సహా సీనియర్‌ నేతలతో మంతనాలు జరపనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాల్సిందిగా వారికి సమాచారం అందించింది. ఈ విషయాన్ని లక్ష్మణ్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు.

షా తెలంగాణ పర్యటన వివరాలు, పార్టీని గెలు పు బాట పట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో ఖరారు చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత వారం పదిరోజుల్లో ఆయన పర్యటన ఉండే అవకాశముంది. అమిత్‌ షా పర్యటనకు ముందు ఇక్కడి పరిస్థితులపై అవగాహన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌జీ రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమవనున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఈ సమావేశాలుంటాయని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు