నేడు జిల్లాకు అమిత్‌షా

4 Feb, 2019 10:09 IST|Sakshi

శ్రీకాకుళం , కాశీబుగ్గ : కేంద్రం అమలు చేస్తున్న 126 సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం పలాస రానున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం  కోట్లాది రూపాయలతో అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకుతింటున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు పలాస నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారని తెలిపారు. కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద ఉదయం బహిరంగ సభ అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీ శ్రేణులంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు