‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’

14 Nov, 2019 13:23 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగజారి వ్యవహరిస్తున్నారని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుది దొంగ దీక్ష అని, తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే బాబు ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక పుష్కలంగా లభ్యమవుతోందని, రాజకీయ లబ్ధి కోసమే బాబు దీక్ష చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడి ద్వారా టీడీపీ నేతలు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

అలాగే ‘వైఎస్సార్‌ రైతు భరోసాకు బాబు వ్యతిరేకమా? 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు వ్యతిరేకమా? సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలనపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? ఇసుక  అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే చంద్రబాబు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని అందుకే టీడీపీని ప్రజలు ఓడించారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు