ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత: ఎమ్మెల్యే

24 Feb, 2020 14:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అమరావతిలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత ఎంపీ నందిగం సరేష్‌పై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. బాబు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే బాబు ఆరాటపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎంపీ నందిగం సురేష్‌పై దాడి)

మరిన్ని వార్తలు