సాక్షి, అమరావతి : ‘గాజు గ్లాసు మాది నిర్ణయం మీది అంటూ’.. తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఊహించిన షాక్ తగిలింది. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. సర్వే చేయించుకొని మరి తన గెలుపుకు అనువైన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలో పోటీచేసిన పవన్ కల్యాణ్కు ఆ రెండు చోట్ల గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తేయ్యే సరికి జనసేనాని ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డిలు ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వైఎస్ జగన్ చరిష్మా ముందు పవన్ స్టార్డమ్ కొట్టుకుపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది.