కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

10 Aug, 2019 12:32 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్‌ వసూళ్లపై కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎగసిపడుతోంది.  తాజాగా కోడెలకు అధికారులు ఝలక్‌ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్‌ హోండా షోరూమ్‌ను సీజ్‌ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా  టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు