వారి పిల్లలే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా?

19 Nov, 2019 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : పేద విద్యార్థుల బాగు కోసం తీసుకువస్తున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యపై విమర్శలు చేయడం దారుణమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ మీడియం విద్యను టీడీపీ స్వాగతిస్తుందో లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధనవంతులు, రాజకీయ నాయకుల పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా అన్ని ప్రశ్నించారు. మత మార్పిడి కోసమే ఇంగ్లీష్‌ మీడియం అంటూ రాధాకృష్ణ రాయడం దారుణమన్నారు. నాటుసారా వస్తుందని చంద్రబాబు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మనుషులే నాటుసారా వ్యాపారస్తులని ఆరోపించారు. మహిళలపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. జనం ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.  

>
మరిన్ని వార్తలు