తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..

24 May, 2019 06:01 IST|Sakshi

జిల్లా చరిత్రలో తండ్రీ కొడుకులు పార్లమెంట్‌కు ఎన్నిక

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరు పార్లమెంట్‌ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు అర్వింద్‌ ధర్మపురి కూడా ఎంపీగా విజయం సాధించారు. కాగా డి శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అర్వింద్‌ బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు