మహాకూటమిపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

5 Nov, 2018 13:47 IST|Sakshi
ఓవైసీ

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మహాకూటమి కాదని, అదొక ఈస్ట్‌ ఇండియా కంపెనీ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను విజయవాడలో ఉండే చంద్రబాబు, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్సెస్‌, ఢిల్లీలోని కాంగ్రెస్‌ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. అందుకే మహా కూటమిని ఈస్ట్‌ ఇండియా కంపెనీ అంటున్నానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు