సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్లో వెంటిలేటర్పై ఉండి చికిత్స పొందిన ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్పేయి కన్నుమూసిన నేపథ్యంలో లైవ్ అప్డేట్స్ ఇవి..
ఎయిమ్స్ నుంచి నివాసానికి వాజ్పేయి పార్థీవదేహం
రేపు అంత్యక్రియలు
అటల్జీ.. మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు: ఎన్టీఆర్
I’m saddened to hear the demise of a great statesman Shri.Vajpayee ji. May his soul Rest In Peace.
— Rajinikanth (@rajinikanth) 16 August 2018
మాజీ ప్రధాని వాజ్పేయి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆయన వాజ్పేయికి ఘననివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాజ్పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.
Grieved over the demise of former Prime Minister Bharat Ratna Shri Atal Bihari Vajpayeeji. My heart felt condolences to his family members. May his soul rest in peace.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 16 August 2018
క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు..
పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే ఆయన అన్నంతగా ఎదిగాడు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశాడు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు.. ఆయనే వాజ్పేయి.. ఆయన జీవితంలోని కీలక విశేషాలివి.. చదవండి: వాజ్పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ...!
శోకసంద్రంలో అభిమానులు!
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న వాజ్పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పూర్తి కథనాన్ని చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వాజ్పేయి కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!
వాజ్పేయి మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
India grieves the demise of our beloved Atal Ji.
His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti.
— Narendra Modi (@narendramodi) 16 August 2018
ఎయిమ్స్లో వాజ్పేయి చికిత్సకు సంబంధించిన పరిణామాలివి..
ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణ