స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

26 Jul, 2019 13:59 IST|Sakshi

ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించిన అవంతి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించే రిజర్వేషన్‌కు టీడీపీ సభ్యులు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్లవి అసలు ఉద్యోగాలే కాదంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అవంతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని సూచిస్తే.. అందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని అవంతి శ్రీనివాస్ సభ దృష్టికి తెచ్చారు. నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఎన్నికలకు ముందు ఆ హామీని అమలు చేసి.. వారిని చంద్రబాబు మోసగించారని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు